పోర్చుగల్లో ఉత్తర, మధ్య ప్రాంతాల్లో కార్చిచ్చు.. 27 మంది ఆహుతి
- October 16, 2017
ఐరోపా కూటమిలోని దేశాలైన పోర్చుగల్, స్పెయిన్ల్లోని అడవుల్లో ఆదివారం మంటలు చెలరేగి మొత్తం 30 మంది సజీవ దహనమయ్యారు. పోర్చుగల్లోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లో ఎగసిపడిన అగ్నికీలల ధాటికి 27 మంది మరణించారు. 20 చోట్ల కార్చిచ్చు ఇంకా విజృంభిస్తుండటంతో అత్యవసర స్థితిని విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి ఆంటోనియో కోస్టా సోమవారం ప్రకటించారు. 4 వేల మందికి పైగా అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, కరువు పరిస్థితులే పోర్చుగల్లో మంటలు ఇంతలా ఎగసిపడటానికి కారణమనీ, ఆదివారం మొత్తంగా 520 చోట్ల అడవుల్లో నిప్పు రాజుకుందని అధికారులు తెలిపారు. ‘మాకు నరకం చాలా దగ్గరగా కనిపించింది. ఎక్కడ చూసినా భయంకరంగా మంటలు ఎగసిపడుతున్నాయి’ అని పెనకోవ పట్టణానికి చెందిన ఓ మహిళ వాపోయారు. ఆమె ఇద్దరు సోదరులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తూ మృత్యువాతపడ్డారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







