తుపాను భయంతో వణుకుతోన్న ఉత్తరాంధ్ర
- October 16, 2017
తుపాను భయంతో ఉత్తరాంధ్ర వణుకుతోంది.. మూడేళ్ల కిందట హుదూద్ మిగిల్చిన నష్టం నుంచి ఇంకా బయటపడకముందే మరో తుపాను భయపెడుతోంది.. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో అటు ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది.
ఈ నెల 19న ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా మధ్య తీర ప్రాంతాన్ని తాకుతుందని అంచనా వేస్తోంది. అయితే వాయుగుండంగా ఏర్పడిన తర్వాతే దాని తీవ్రతపై ఒక స్పష్టత వస్తుందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాయుగుండం పయనించే వేగం నెమ్మదిగా ఉంటే బలంగా మారుతుందని, వేగంగా పయనిస్తే సాధారణ వాయుగుండంగానే తీరాన్ని తాకుతుందంటున్నారు.
వాయుగుండం ప్రభావంతో ఈరోజు నుంచే భారీ వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ అధికారులు. రేపట్నుంచి కోస్తా, ఒడిశాలో అతి భారీ వర్షాలు, తెలంగాణ, రాయలసీమలో మోస్తరు వర్షాలు పడతాయన్నారు. అటు ఉత్తరాంధ్ర జిల్లాలకు తుపాను ముప్పు ఉన్నట్లు ఇస్రో గుర్తించడంతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఎప్పటి కప్పుడు వాతావరణ పరిస్థితుల్ని అధ్యయనం చేయాలన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







