వేశ్య పాత్రలో కనువిందు చేయనున్న నటి సదా
- October 16, 2017
వేశ్యలపై వచ్చే కథలు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ పొందుతూనే ఉన్నాయి.. ప్రతి సుఖానికీ రేటుంటుంది ఈ లోకంలో కోరుకున్న సుఖం కోసం అడిగినంత రేటు పెట్టి మరీ కొంటారు కొందరు మగాళ్లు...!! పడక సుఖం తో సహా..!! మరి డబ్బుకోసం తమ మానాన్ని అమ్ముకొంటూ.. ఊరూపేరూ తెలియని వారికి పడక సుఖం అందిస్తున్న స్త్రీలు అందరూ ఇష్టంగానే ఆ వృత్తిని చేపట్టరా..? ఈ ప్రశ్ననే కథ గా మలిచి సినిమాగా తెరకెక్కిస్తునారు దర్శకుడు అబ్దుల్ మజిత్.. "టార్చ్ లైట్" పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వేశ్య పాత్రలో ప్రముఖ నటి సదా నటిస్తుంది. అర్ధరాత్రి హైవేల పక్కన నిలబడి విటుల కోసం వేచి చూసే వేశ్య పాత్రలో నటిస్తున్న సదా... తెలుగులో జయం సినిమాతో అడుగు పెట్టింది. ఇప్పటివరకూ ఎప్పుడూ కుటుంబ కథా చిత్రాల్లో.. తన హద్దుల్లో నటిస్తున్న సదా... అందాల ప్రదర్శన విషయంలో కూడా ఎక్కడా హద్దులు దాటలేదని చెప్పవచ్చు. కాగా దర్శకుడు సదా ని ఫస్ట్ ఛాయిస్ గా అనుకోలేదు.. చాలా మంది హీరోయిన్లు అడిగిన అబ్ధుల్ వారు వేశ్యగా నటించడానికి నో చెప్పగా... చివరికి సదా ని సంప్రదించగా.. కథ విన్న వెంటనే ఒకే చెప్పిందని.. అబ్దుల్ చెప్పారు. సదా బుల్లి తెరపై డ్యాన్స్ షో లకు జడ్జ్ గా వ్యవహరిస్తున్న సంగతి విధితమే..
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







