హైదరాబాద్ శివార్ల రామచంద్రాపురం మండలం కొల్లూరులో ముగ్గురు యువతుల మృతదేహాలు

- October 16, 2017 , by Maagulf
హైదరాబాద్ శివార్ల రామచంద్రాపురం మండలం కొల్లూరులో ముగ్గురు యువతుల మృతదేహాలు

హైదరాబాద్ శివారులోని రామచంద్రాపురం మండలం కొల్లూరు దగ్గర డెడ్‌బాడీలు కలకలం సృష్టించాయి. అవుటర్‌ రింగ్‌ రోడ్‌ పక్కనే ముగ్గురు యువతుల మృతదేహాలు పడి ఉన్నాయి. ఉదయం గుర్తించిన స్థానికులు... పోలీసులకు సమాచారం అందించారు. ఒకే స్పాట్‌లో ముగ్గురి డెడ్‌బాడీలు పడి ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా చంపి అక్కడ పడేసి ఉంటారంటున్నారు స్థానికులు.

ముగ్గురిలో ఇద్దరు యువతులు 20 ఏళ్లలోపు వయసున్నవారే. మరో మహిళ వయసు సుమారు 40 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. వీరు ముగ్గురూ హైదరాబాద్‌కు చెందిన వారై ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com