అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి

- July 19, 2026 , by Maagulf
అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి

న్యూఢిల్లీ: పార్లమెంటరీ లైబ్రరీ హాల్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అనుసరించాల్సిన విధానాలు, సభా కార్యక్రమాలపై ఈ సమావేశంలో అన్ని పార్టీల నాయకులతో చర్చించారు.

ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంటరీ పార్టీ నేతలు పాల్గొని, పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. జనసేన పార్లమెంటరీ పార్టీ నాయకుడు వల్లభనేని బాలశౌరి కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com