అప్ఘనిస్థాన్ పోలీసు హెడ్క్వార్టర్స్పై ఉగ్రవాదుల మెరుపుదాడి
- October 17, 2017
అప్ఘనిస్థాన్ పోలీసు ఉన్నత కార్యాలయాలపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఓ ఉగ్రవాది కారు బాంబుతో ఆత్మహుతి దాడికి పాల్పడగా పలువురు సాయుధులు కాల్పులతో తెగబడ్డారు. ఈ దాడిని తామే చేసినట్లు ఉగ్రవాద సంస్థ తాలిబన్ ప్రకటించింది. ఈ దాడిలో ఎంతమంది చనిపోయారు? ఎంత నష్టం జరిగిందనే వివరాలు ఇంకా తెలియరాలేదు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం పక్తియా ప్రావిన్స్లోని గార్డెజ్ ప్రాంతంలో పోలీసుల శిక్షణ కేంద్రం ఉంది. అక్కడే పోలీసుల హెడ్క్వార్టర్స్ కూడా ఉన్నాయి. వాటినే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని ప్రస్తుతానికి అత్యవసర సమయాల్లో స్పందించే బృందం ఉగ్రవాదులను కట్టడి చేసే పనిలో ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







