గోపీచంద్ తో పోటీకి సిద్ధం అంటున్న రామ్
- October 17, 2017
టాలీవుడ్లో ఈ మధ్య సంక్రాంతి, దసరా సీజన్లలో మినహాయించి, ఎప్పుడో ఒకసారి తప్ప సినిమాలు ఒకేరోజు బాక్సాఫీస్ బరిలో దిగడం లేదు. ఒకవేళ వస్తే..ఆ ప్రభావం ఓపెనింగ్స్ తో పాటు కలెక్షన్ల మీద పడుతుంది. కానీ ఈ నెలాఖరున అంచనాలున్న రెండు సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి.
ఈ నెల 27న తెలుగులో రెండు సినిమాలు వస్తున్నాయి. వాటిల్లో ఒకటి రామ్ నటించిన ఉన్నది ఒక్కటే జిందగీ, మరొకటి గోపిచంద్ నటించిన ఆక్సిజన్. రామ్ కి యూత్ లో ఫాలోయింగ్ ఉంటే, గోపిచంద్ కి మాస్ లో క్రేజ్ ఉంది. అందుకే ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఉంది.
ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకుడు. రామ్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాటి నటిస్తున్నారు. లవ్, ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఆల్ రెడీ రిలీజైన ట్రైలర్, సాంగ్స్ కి ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది.
ఇక గోపిచంద్ ఆక్సిజన్ మీద కూడా అంచనాలున్నాయి. జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో అను ఇమ్మానుయేల్, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు. ట్రైలర్ చూస్తే...ఈ మూవీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ లా అనిపిస్తోంది. అయిత రామ్, గోపిచంద్ నటించిన గత చిత్రాలు నిరాశపరిచాయి. దీంతో వీరిద్దరికీ ఇప్పుడు హిట్ కావాలి. మరి ఒకే రోజు వస్తున్న చిత్రాలతో రామ్, గోపిచంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారో లేదో చూడాలి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







