ఫిషింగ్ బోట్ ప్రమాదం: ఎమిరేటీ కెప్టెన్, ఇండియన్ వర్కర్కి గాయాలు
- October 18, 2017
ఫిషింగ బోట్లో అగ్ని ప్రమాదం కారణంగా, ఎమిరేటీ కెప్టెన్, ఇండియన్ మెరైన్ వర్కర్ గాయాలపాలయ్యారు. రస్ అల్ ఖైమాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రస్ అల్ ఖైమా పోలీస్ - సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్ ఈ ఘటన గురించిన సమాచారం అందుకోగానే, పోలీస్ పెట్రోల్స్నీ, అంబులెన్స్, పారామెడిక్స్, అలాగే రెస్క్యూ టీమ్స్ని సంఘటనా స్థలానికి పంపారు. రస్ అల్ ఖైమా ఫిషర్మెన్ సొసైటీ ఛైర్మన్ ఖలీఫా అల్ ముహైరి మాట్లాడుతూ, షామ్ టౌన్ తీర ప్రాంతానికి దగ్గరలో ఈ ప్రమాదం జరిగిందనీ, రస్ అల్ ఖైమా సిటీకి ఉత్తరంలో 40 కిలోమీటర్ల దూరంలో ఘటన జరిగిందని చెప్పారు. ఎమిరేటీ కెప్టెన్, ఫిషింగ్ బోట్ యజమానిగా గుర్తించారు. గాయపడ్డవారిని సక్ర్ హాస్పిటల్కి చికిత్స నిమిత్తం తరలించారు. వీరిద్దరికీ చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. సాయంత్రం 5.30 నిమిషాల సమయంలో ఈ గటన చోటు చేసుకుంది. పేలుడుకు గల కారణాల్ని విచారిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







