ఫిషింగ్ బోట్ ప్రమాదం: ఎమిరేటీ కెప్టెన్, ఇండియన్ వర్కర్కి గాయాలు
- October 18, 2017
ఫిషింగ బోట్లో అగ్ని ప్రమాదం కారణంగా, ఎమిరేటీ కెప్టెన్, ఇండియన్ మెరైన్ వర్కర్ గాయాలపాలయ్యారు. రస్ అల్ ఖైమాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రస్ అల్ ఖైమా పోలీస్ - సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్ ఈ ఘటన గురించిన సమాచారం అందుకోగానే, పోలీస్ పెట్రోల్స్నీ, అంబులెన్స్, పారామెడిక్స్, అలాగే రెస్క్యూ టీమ్స్ని సంఘటనా స్థలానికి పంపారు. రస్ అల్ ఖైమా ఫిషర్మెన్ సొసైటీ ఛైర్మన్ ఖలీఫా అల్ ముహైరి మాట్లాడుతూ, షామ్ టౌన్ తీర ప్రాంతానికి దగ్గరలో ఈ ప్రమాదం జరిగిందనీ, రస్ అల్ ఖైమా సిటీకి ఉత్తరంలో 40 కిలోమీటర్ల దూరంలో ఘటన జరిగిందని చెప్పారు. ఎమిరేటీ కెప్టెన్, ఫిషింగ్ బోట్ యజమానిగా గుర్తించారు. గాయపడ్డవారిని సక్ర్ హాస్పిటల్కి చికిత్స నిమిత్తం తరలించారు. వీరిద్దరికీ చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. సాయంత్రం 5.30 నిమిషాల సమయంలో ఈ గటన చోటు చేసుకుంది. పేలుడుకు గల కారణాల్ని విచారిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!









