దీపావళి శుభాకాంక్షలు తెలిపిన నేతలు

- October 18, 2017 , by Maagulf
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన నేతలు

హైదరాబాద్‌: దీపావళి సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి గెలుపునకు దీపావళి ప్రతీకగా నిలుస్తుందన్న ఆయన... రంగురంగుల దీపాలను వెలిగించి ప్రజలు ఘనంగా పండుగ జరుపుకుంటారని అన్నారు. శాంతి, సామరస్యం, నవ సమాజ నిర్మాణానికి దీపావళి ఆదర్శంగా నిలుస్తుందని ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో పండగ కొత్త వెలుగులు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేలా, ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా దీవించాలని దేవుడిని ప్రార్థించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com