టాస్క్‌ఫోర్స్‌ ను రంగంలోకి దింపుతున్న కేటీఆర్

- October 18, 2017 , by Maagulf
టాస్క్‌ఫోర్స్‌ ను రంగంలోకి దింపుతున్న కేటీఆర్

హైదరాబాద్: నగరంలో రోడ్ల పరిశీలన కోసం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. బుధవారం నగర రోడ్లపై అధికారులతో సమీక్ష జరిపిన మంత్రి కేటీఆర్.. మీడియాతో మాట్లాడారు. రోడ్ల మరమ్మతులు, కొత్త ప్రాజెక్టుల బాధ్యతలను టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో రోడ్ల నిర్మాణానికి రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతులు చేస్తామన్నారు. ఇప్పటికే రూ. 77కోట్లతో రోడ్ల మరమ్మతు పనులు ప్రారంభించామన్నారు. నీళ్లు నిలిచే ప్రాంతాల్లో రూ.130 కోట్లతో వైట్ టాపింగ్ రోడ్లు వేస్తామన్నారు. నగరంలో రోడ్ల నిర్వహణ కోసం డివిజన్ కొక ఇంజనీర్‌ని ఏర్పాటుచేస్తామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com