టాస్క్ఫోర్స్ ను రంగంలోకి దింపుతున్న కేటీఆర్
- October 18, 2017
హైదరాబాద్: నగరంలో రోడ్ల పరిశీలన కోసం టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. బుధవారం నగర రోడ్లపై అధికారులతో సమీక్ష జరిపిన మంత్రి కేటీఆర్.. మీడియాతో మాట్లాడారు. రోడ్ల మరమ్మతులు, కొత్త ప్రాజెక్టుల బాధ్యతలను టాస్క్ఫోర్స్కు అప్పగించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో రోడ్ల నిర్మాణానికి రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతులు చేస్తామన్నారు. ఇప్పటికే రూ. 77కోట్లతో రోడ్ల మరమ్మతు పనులు ప్రారంభించామన్నారు. నీళ్లు నిలిచే ప్రాంతాల్లో రూ.130 కోట్లతో వైట్ టాపింగ్ రోడ్లు వేస్తామన్నారు. నగరంలో రోడ్ల నిర్వహణ కోసం డివిజన్ కొక ఇంజనీర్ని ఏర్పాటుచేస్తామన్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









