ఉత్తరాంధ్రకు తప్పిన వాయు'గండం'

- October 20, 2017 , by Maagulf
ఉత్తరాంధ్రకు తప్పిన వాయు'గండం'

ఉత్తరాంధ్రకు వాయుగుండం ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నిన్న రాత్రి పారాదీప్‌కు సమీపంలో తీరం దాటింది. ఇది.. చాంద్‌బలీకి పశ్చిమంగా 25 కిలోమీటర్ల దూరంతో భూమి పైన కేంద్రీకృతమై ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది..తూర్పు ఈశాన్యదిశగా పయనిస్తూ క్రమేపీ బలహీనపడుతుందని వాతావరణశాఖ అదికారులు చెప్పారు. వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లో చాల చోట్ల వర్షాలు కురుస్తాయని అన్నారు. అదే సమయంలో ఉత్తరకోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో  బలమైన ఈదురు గాలులు వీస్తాయని అన్నారు.. ఈ సమయంలో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అదికారులు హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com