మసీదు దగ్గర ఆత్మాహుతి దాడి, 30 మంది మృతి

- October 20, 2017 , by Maagulf
మసీదు దగ్గర ఆత్మాహుతి దాడి, 30 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్‌పై ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. రాజధాని కాబూల్‌కు దగ్గరలో ఉన్న ఒక మసీదు ముందు ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేశాడు. ఈ ఘటనలో 30 మంది చనిపోయారు. శుక్రవారం రాత్రి ప్రార్థనల అనంతరం మసీదునుంచి భక్తులు బయటకు వస్తున్న సమయంలో ఆత్మాహుతి దాడి జరిగిందని భద్రతాధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ 30 మృత దేహాలను గుర్తించినట్లు భద్రతా దళాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంతవరకూ క్షతగాత్రుల సంఖ్య కూడా భారీగానే ఉండే అవకాశముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com