వరుసగా మూడోసారి ఆసియా కప్ సొంతం చేసుకున్న భారత్
- October 22, 2017
ఆసియా కప్ హాకీ-2017 టైటిల్ను భారత్ కైవసం చేసుకుంది. ఆదివారం ఢాకా వేదికగా మలేసియాతో తలపడిన భారత్ హాకి జట్టు 2-1 గోల్స్ తేడాతో విజయ భేరి మోగించింది. టోర్నీలో గ్రూప్ దశ నుంచి భారత్ ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. ఫస్ట్ హాఫ్ మూడో నిమిషంలో రమణ్ దీప్ సింగ్ గోల్ చేయడంతో భారత్ ఖాతా తెరిచింది.
అనంతరం 29వ నిమిషంలో లలిత్ ఉపాధ్యాయ్ మరో గోల్ను భారత్కు అందించారు. మైదానంలో మెరుపులా కదులుతున్న భారత ఆటగాళ్ల నుంచి బంతిని లాక్కునేందుకు మలేసియా స్ట్రైకర్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మలేసియా ఆటగాడు సహ్రిల్ సాబా 50వ నిమిషంలో ఆ జట్టుకు తొలి గోల్ అందించాడు.
మిగిలిన సమయంలో మలేసియా ఆటగాళ్లను గోల్ చేయనివ్వకుండా భారత ప్లేయర్లు చేసిన ప్రయత్నాలు సఫలం చెందాయి. దీంతో భారత్ మూడో మారు ఆసియా విజేతగా నిలిచింది. లలిత్ ఉపాధ్యాయ్కు గోల్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా, ఆకాశ్ దీప్ సింగ్ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







