200,000 దిర్హామ్‌లకే ఫెరారీ కారు

- October 23, 2017 , by Maagulf
200,000 దిర్హామ్‌లకే ఫెరారీ కారు

దుబాయ్‌లో నలుగురు సభ్యుల దొంగల ముఠా 1.2 మిలియన్‌ దిర్హామ్‌ల విలువైన ఫెరారీ కారుని 200,000 దిర్హామ్‌లకే విక్రయించిన ఘటన వెలుగు చూసింది. అయితే ఆ కారుని డిస్‌మాండిల్‌ చేసి, కార్గో చేయాలనే ప్రయత్నంలో దొంగల ముఠా ఉండగానే పోలీసులు పట్టుకోవడం జరిగింది. యూరోప్‌కి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు తన కారు దొంగలింపబడినట్లు ఫిర్యాదు చేశారు. ఆ కారుని ఆఫ్రికాకి చెందిన ఓ వ్యక్తికి 55,000 దిర్హామ్‌లకే విక్రయించినట్లు దుబాయ్‌ పోలీస్‌ - క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ అసిస్టెంట్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ ఖలీల్‌ ఇబ్రహీమ్‌ అల్‌ మన్సూరి చెప్పారు. ఆఫ్రికన్‌ నిందితుడు, ఆ కారుని గ్యారేజ్‌కి తీసుకెళ్ళి, అక్కడినుంచి విదేశాలకు తరలించి, స్పేర్‌ పార్టులుగా ఆ కారుని అమ్మేందుకు యత్నించాడు. నిందితుడు యూఏఈకి విజిట్‌ వీసాపై వచ్చినట్లు తెలిపారు. కారు మాజీ ఓనర్‌, ఆ కారు వివరాలు నిందితులకు చెప్పడంతో, వ్యూహాత్మకంగా కారుని దొంగిలించేందుకు ముఠాగా ఏర్పడ్డారు. కారు అలాగే కారు ఓనర్‌ని ఈ ముఠా అనుసరిస్తూ, సమయం చూసి దాన్ని దొంగిలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com