200,000 దిర్హామ్లకే ఫెరారీ కారు
- October 23, 2017
దుబాయ్లో నలుగురు సభ్యుల దొంగల ముఠా 1.2 మిలియన్ దిర్హామ్ల విలువైన ఫెరారీ కారుని 200,000 దిర్హామ్లకే విక్రయించిన ఘటన వెలుగు చూసింది. అయితే ఆ కారుని డిస్మాండిల్ చేసి, కార్గో చేయాలనే ప్రయత్నంలో దొంగల ముఠా ఉండగానే పోలీసులు పట్టుకోవడం జరిగింది. యూరోప్కి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు తన కారు దొంగలింపబడినట్లు ఫిర్యాదు చేశారు. ఆ కారుని ఆఫ్రికాకి చెందిన ఓ వ్యక్తికి 55,000 దిర్హామ్లకే విక్రయించినట్లు దుబాయ్ పోలీస్ - క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీమ్ అల్ మన్సూరి చెప్పారు. ఆఫ్రికన్ నిందితుడు, ఆ కారుని గ్యారేజ్కి తీసుకెళ్ళి, అక్కడినుంచి విదేశాలకు తరలించి, స్పేర్ పార్టులుగా ఆ కారుని అమ్మేందుకు యత్నించాడు. నిందితుడు యూఏఈకి విజిట్ వీసాపై వచ్చినట్లు తెలిపారు. కారు మాజీ ఓనర్, ఆ కారు వివరాలు నిందితులకు చెప్పడంతో, వ్యూహాత్మకంగా కారుని దొంగిలించేందుకు ముఠాగా ఏర్పడ్డారు. కారు అలాగే కారు ఓనర్ని ఈ ముఠా అనుసరిస్తూ, సమయం చూసి దాన్ని దొంగిలించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









