అబుదాబిలో చంద్రబాబు మూడోరోజు పర్యటన
- October 23, 2017
3రోజుల గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు చంద్రబాబు అబుదాబీలో పర్యటించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. గల్ఫ్ వాణిజ్య దిగ్గజం డాక్టర్ బీఆర్ షెట్టీతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. దీనికి పలువురు దిగ్గజాలు హాజరయ్యారు. రాష్ట్రంలో ఉన్న వనరులు, పెట్టుబడులకు అనుకూల పరిస్థితులను వారికి వివరించారు. విదేశీ పెట్టుబడలుతో వచ్చేవారికి రాయితీలు ఇస్తున్నట్టు తెలిపారు. సన్ రైజ్ ఆఫ్ ఇండియాగా ఉన్న ఏపీలో వ్యాపారాలకు అత్యంత అనుకూల ప్రదేశామన్నారు. చంద్రబాబు ప్రజంటేషన్ పై గల్ఫ్ పారిశ్రామిక వేత్తులు ఆసక్తి చూపారు. పలువురు పెట్టుబడులకు సంసిద్దత వ్యక్తం చేస్తున్నారు.
అనంతరం యుఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ అల్లుడు షేక్ హమీద్ బిన్ తహ్నౌన్ అల్ నహ్యాన్తో మర్యాదపూర్వక భేటీ అయ్యారు. ఏపీలో అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఏపీలో పెట్టుబడులు పెడితే అన్ని విధాలా సహకరిస్తామని ఆదేశ రాజ కుటుంబానికి తెలిపారు. ప్రవాసాంధ్రులపై కూడా ఆయనతో చర్చించారు. ఏపీలో పర్యటించాలని కోరారు.
అంతకుముందు అబుదాబీలోని పలు చారిత్రక ప్రదేశాలను చంద్రబాబు సందర్శించారు. ఇందులో భాగంగా షేక్ జాయేద్ గ్రాండ్ మసీదును సందర్శించి ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. ఇక డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్లో ఛాంపియన్గా నిలిచిన భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందనలు. ఈ విజయంతో మన శ్రీకాంత్ సూపర్ హీరోగా నిలిచి చరిత్ర సృష్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంశసించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







