భారత్లో అమెరికా రాయబారిగా కెన్ జస్టర్ నియామకం
- October 24, 2017
భారత్లో అమెరికా రాయబారిగా కెన్ జస్టర్ను నియమించాలన్న అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనపై ఆ దేశ సెనెట్లో గురువారం ఓటింగ్ జరగనుంది. భారత్, అమెరికాల మధ్య కీలకమైన పౌర అణుఒప్పందం కుదర్చటంలో కీలక పాత్ర వహించిన జస్టర్ను భారత్కు రాయబారిగా పంపటంలో అభ్యంతరాలేవీ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో మరో 14 దేశాలకు రాయబారుల నియామకాలపైనా సెనెట్లో ఓటింగ్ జరుగనుంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక అప్పటి వరకూ భారత్లో రాయబారిగా ఉన్న రిచర్డ్ వర్మ రాజీనామా సమర్పించారు. అతని స్థానంలో కెన్ జస్టర్ను ట్రంప్ ప్రతిపాదించారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







