హిమాలయాల్లో ఆశ్రమం నిర్మించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్

- October 26, 2017 , by Maagulf
హిమాలయాల్లో ఆశ్రమం నిర్మించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తరచుగా హిమాలయాలు సందర్శిస్తుంటారు. సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే మధ్య మధ్యలో విరామం కోసం హిమాలయాలకు వెళ్లి మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో 2002లో దునగిరి ప్రాంతంలో గల గుహల్లో యోగా చేసుకునేందుకు వెళ్ళిన ఆయనకి చెన్నైకి చెందిన విశ్వనాథన్, బెంగళూరుకు చెందిన విఎస్ హరి, విఎస్ మూర్తి, ఢిల్లీకి చెందిన శ్రీధర్ రావులతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే స్నేహంగా మారి అయిదుగురూ కలిసి ఆశ్రమాన్ని స్థాపించాలనుకున్నారు. దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టి పరమహంస యోగానంద ఆశ్రమాన్ని నిర్మించారు. పరమహంస యోగానందచే స్థాపించబడిన యోగోద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆశ్రమాన్ని స్థాపించినట్లు రజనీ స్నేహితులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com