హిమాలయాల్లో ఆశ్రమం నిర్మించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్
- October 26, 2017
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తరచుగా హిమాలయాలు సందర్శిస్తుంటారు. సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే మధ్య మధ్యలో విరామం కోసం హిమాలయాలకు వెళ్లి మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో 2002లో దునగిరి ప్రాంతంలో గల గుహల్లో యోగా చేసుకునేందుకు వెళ్ళిన ఆయనకి చెన్నైకి చెందిన విశ్వనాథన్, బెంగళూరుకు చెందిన విఎస్ హరి, విఎస్ మూర్తి, ఢిల్లీకి చెందిన శ్రీధర్ రావులతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే స్నేహంగా మారి అయిదుగురూ కలిసి ఆశ్రమాన్ని స్థాపించాలనుకున్నారు. దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టి పరమహంస యోగానంద ఆశ్రమాన్ని నిర్మించారు. పరమహంస యోగానందచే స్థాపించబడిన యోగోద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆశ్రమాన్ని స్థాపించినట్లు రజనీ స్నేహితులు తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









