ముంబైలో భారీ అగ్నిప్రమాదం

- October 26, 2017 , by Maagulf
ముంబైలో భారీ అగ్నిప్రమాదం

ముంబైలో బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ దగ్గర్లో ఉన్న గరీబ్‌నగర్‌లో చెలరేగిన మంటలు కాసేపటికే చుట్టుపక్కలకు విస్తరించాయి. స్టేషన్‌లోని పాదచారుల వంతెనకు కూడా మంటలు అంటుకున్నాయి. ప్రస్తుతం 16 ఫైరింజన్లతో మంటల్ని ఆర్పారు. ఈ ప్రమాదం నేపథ్యంలో తాత్కాలికంగా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. దట్టమైన పొగ కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యారు.

గరీబ్‌నగర్‌లో కొంతకాలంగా పేదలు అనుమతి లేకుండా నివసిస్తున్నారు. దీంతో కాలనీని ఖాళీ చేయాలంటూ బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ అధికారులు బుధవారం నోటీసులిచ్చారు. అయితే గురువారం మధ్యాహ్నం హఠాత్తుగా కాలనీకి చేరుకున్న సిబ్బంది.. జేసీబీలతో ఇళ్లను కూల్చడం మొదలు పెట్టారు. ఇంతలో ఓ ఇంట్లో సిలిండర్లు పేలడంతో మంటలు అంటుకున్నాయి. ఇవి క్రమంగా కాలనీ అంతటా వ్యాపించి... స్టేషన్‌ను చుట్టుముట్టాయి.

ప్రమాదం జరిగిన అరగంటకు కానీ ఫైరింజన్లు రాలేదని.. అందువల్లే మంటల తీవ్రత పెరిగిపోయిందని.. స్థానికులు చెబుతున్నారు. కాలనీ ఖాళీ చేసేందుకు 48 గంటల గడువు ఇచ్చిన అధికారులు.. 24 గంటలు గడవక ముందే వచ్చి దౌర్జన్యం చేశారని... ఆ హడావుడిలోనే అగ్నిప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com