బాణసంచా కర్మాగారంలో పేలుడు, 47 మంది మృతి
- October 26, 2017
ఇండోనేషియలోని జకార్తాలో పెను విషాదం చోటుచేసుకుంది. జకార్తా సమీపంలోని తంగెరాంగ్ ప్రాంతంలో ఈ ఉదయం ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 47 మంది సజీవ దహనమయ్యారు. పేలుడు సమయంలో ఫ్యాక్టరీలో 103 మంది పనిచేస్తున్నట్టు సమాచారం. పేలుడు దాటికి మంటలు ఫ్యాక్టరీ అంతటా వ్యాపించడంతో తప్పించుకునే మార్గం లేక చాలామంది వాటికి ఆహుతయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 47 మంది మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన మరో 43 మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. చాలా వరకు మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేనంతంగా కాలిపోయాయని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పేలుడు దాటికి ఫ్యాక్టరీ పక్కనే ఉన్న భవనం కూడా సగం వరకు కూలిపోయింది. మంటల దాటికి కార్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. ఉదయం పది గంటల సమయంలో ఓ పేలుడు సంభవించిందని, మూడు గంటల తర్వాత మరో పేలుడు జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఫ్యాక్టరీ ఆరు వారాల నుంచి మాత్రమే నడుస్తున్నట్టు స్థానిక అధికారి ఒకరు తెలిపారు. ఈ పేలుళ్లకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









