బాణసంచా కర్మాగారంలో పేలుడు, 47 మంది మృతి
- October 26, 2017
ఇండోనేషియలోని జకార్తాలో పెను విషాదం చోటుచేసుకుంది. జకార్తా సమీపంలోని తంగెరాంగ్ ప్రాంతంలో ఈ ఉదయం ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 47 మంది సజీవ దహనమయ్యారు. పేలుడు సమయంలో ఫ్యాక్టరీలో 103 మంది పనిచేస్తున్నట్టు సమాచారం. పేలుడు దాటికి మంటలు ఫ్యాక్టరీ అంతటా వ్యాపించడంతో తప్పించుకునే మార్గం లేక చాలామంది వాటికి ఆహుతయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 47 మంది మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన మరో 43 మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. చాలా వరకు మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేనంతంగా కాలిపోయాయని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పేలుడు దాటికి ఫ్యాక్టరీ పక్కనే ఉన్న భవనం కూడా సగం వరకు కూలిపోయింది. మంటల దాటికి కార్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. ఉదయం పది గంటల సమయంలో ఓ పేలుడు సంభవించిందని, మూడు గంటల తర్వాత మరో పేలుడు జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఫ్యాక్టరీ ఆరు వారాల నుంచి మాత్రమే నడుస్తున్నట్టు స్థానిక అధికారి ఒకరు తెలిపారు. ఈ పేలుళ్లకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







