ట్రాఫిక్ జరీమానాలపై 55 శాతం డిస్కౌంట్ .!
- October 26, 2017
రస్ అల్ ఖైమా: నవంబర్ 1 నుంచి 15 వరకు రస్ అల్ ఖైమా పోలీసులు ట్రాఫిక్ జరీమానాలపై 55 శాతం డిస్కౌంట్ని అందుబాటులోకి తెస్తున్నారు. కేవలం రెండు వారాలు మాత్రమే ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో జరీమానాలు చెల్లించాల్సినవారు వీలైనంత త్వరగా చెల్లించాలని రస్ అల్ ఖైమా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అది అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్ నౌమి చెప్పారు. రస్ అల్ ఖైమా రూలర్, మెంబర్ ఆఫ్ సుప్రీమ్ కౌన్సిల్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి ఏడవ యాక్సెసన్ యానివర్సరీ సందర్భంగా ఈ ఆఫర్ని ప్రకటించినట్లు మేజర్ జనరల్ అది అబ్దుల్లా చెప్పారు. ఎమిరేట్లో ఈ తరహా డిస్కౌంట్ ఇదే తొలిసారి. వాహనదారులు తమ వాహనాల్ని నిబంధనలకు అనుగుణంగా నడపాలనీ, జరీమానాలు విధించడం ద్వారా వాహనదారులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యం రస్ అల్ ఖైమా పోలీసులకు లేదనీ, వాటి ఉద్దేశ్యం వాహనదారుల్లో చైతన్యం పెంచడమేనని వివరించారు అది అబ్దుల్లా.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







