గల్ఫ్ బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి
- November 06, 2015
గల్ఫ్ బాధితులను ఆదుకోవాల్సిందిగా కేంద్ర విదేశాంగశాఖాధికారులను కోరినట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు. కేంద్ర విదేశాంగ శాఖ ఉన్నతాధికారులను మంత్రి కేటీఆర్ నేడు కలిశారు. ఈ భేటీలో ఎంపీ వినోద్, రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్లు పాల్గొన్నారు. భేటీ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గల్ఫ్ బాధితుల కష్టాలను కేంద్ర విదేశాంగశాఖ దృష్టికి తీసుకువెళ్లాం. గల్ఫ్లో తెలంగాణవాసులు ఇబ్బంది పడుతున్నరు. బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాం. గల్ఫ్లో కరీంనగర్ జిల్లావాసులు వేల సంఖ్యలో కార్మికులుగా పని చేస్తున్నరు. పనుల నిమిత్తం వెళ్లిన మహిళలకు ఎదురైన ఇబ్బందులను మంత్రిత్వశాఖ అధికారులకు వివరించినం. గల్ఫ్లాంటి ప్రాంతాల్లో మహిళలను ఇళ్ల పనుల్లోకి తీసుకురాకుండా కేంద్ర నిషేధ చట్టాన్ని తీసుకురావాలని కోరాం. గల్ఫ్తో పాటు విదేశాల్లో పని చేస్తున్న భారతీయులందరి వివరాలను ఒకే డేటాగా రూపొందించాలని కోరాం. రాష్ర్టాలతో విదేశీ మంత్రిత్వశాఖ వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేయాలని సూచించినం. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పెద్దూరుకు చెందిన ఐదురుగు కార్మికులు ఎదుర్కొంటున్న శిక్షపై చొరవ చూపాలని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్కు విజ్ఞప్తి చేశాం. అందుకు సంబంధించి రెఫరెండంను అధికారులకు అందజేసినం. అవసరమైతే బాధిత కుటుంబాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







