ఉరితీయాలంటూ ప్రియ తల్లిదండ్రులు ఆగ్రహం

- October 29, 2017 , by Maagulf
ఉరితీయాలంటూ ప్రియ తల్లిదండ్రులు ఆగ్రహం

దిల్లీ: దిల్లీలో ఇటీవల ప్రియా మెహ్రా అనే వివాహితపై కాల్పులు జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ కేసులో నిందితుడైన ప్రియ భర్త పంకజ్‌ మెహ్రాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే కేవలం దర్యాప్తు చేసి జైల్లో పెట్టడం కాకుండా పంకజ్‌ను ఉరితీయాలంటూ ప్రియ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రియ, పంకజ్‌ ప్రేమించి వివాహం చేసుకున్నారని, ఇప్పుడు ఇలా హత్య చేసి చంపుతాడని అసలు వూహించలేదని పంకజ్‌ తండ్రి తెలిపారు. అప్పు ఎగ్గొట్టడానికి పంకజ్‌ ఈ మర్డర్‌ ప్లాన్‌ వేసినట్లు విచారణలో తెలిపాడు. అదీకాకుండా అతనికి రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ఓ గాయనితోవివాహేతర సంబంధం ఉందని కూడా వార్తలు వెలువడుతున్నాయి. ఆమెతోకలిసి ఉండేందుకే భార్యను వదిలించుకోవాలనుకున్నాడని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పంకజ్‌ పోలీసుల కస్టడీలో ఉన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com