సన్యాసిగా మారిన విజువల్ గ్రాఫిక్స్ 'లోకేష్'
- October 29, 2017
జీవితంలో ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో తనకు ఎదురయ్యే కష్టాల నుండి తప్పించుకుని సన్యాసం తీసుకుంటే బావుంటుందని అనుకుంటారు. కానీ బంధాలు.. బాధ్యతలు.. ఆశలు.. కోర్కెలు.. వెనక్కి లాగేస్తుంటాయి. కానీ వీటన్నింటిని తృణప్రాయంగా భావించి సన్యాసం స్వీకరిస్తున్న వారు ఇటీవల వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు. మొన్నామధ్య భార్యాభర్తలు కోట్ల ఆస్తిని, ఆఖరికి పేగుబంధాన్ని కూడా వదులుకుని సన్యాసం స్వీకరించారు. ఇప్పుడు అదే కోవకి చెందిన మరో వ్యక్తి పేరు వినిపిస్తోంది. ఛత్తీస్ఘడ్లోని జగదల్పూర్కు చెందిన లోకేష్ గోల్చా. ఇతడు అమెరికాలో ఓ పెద్ద గ్రాఫిక్ డిజైనింగ్ సంస్థకు అధిపతి. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. బంధువుల సాయంతో చదువుకుంటూ విశాఖపట్నంలోనే విజువల్ గ్రాఫిక్స్లో డిప్లమో పూర్తి చేశాడు. అంచెలంచెలుగా ఎదిగి అమెరికాలో ప్రముఖ కంపెనీ భాగస్వామ్యంతో గ్రాఫిక్ డిజైనింగ్ స్టూడియోను స్థాపించే స్థాయికి ఎదిగాడు. ఇదిలా ఉండగా జైన ముని పియూష్ సాగర్ ఉపన్యాసాలకు లోకేష్ ప్రభావితుడయ్యాడు. సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. నవంబరు 15న తన గురువు నుంచి దీక్ష తీసుకోనున్నారు లోకేష్.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







