సన్యాసిగా మారిన విజువల్ గ్రాఫిక్స్ 'లోకేష్'
- October 29, 2017
జీవితంలో ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో తనకు ఎదురయ్యే కష్టాల నుండి తప్పించుకుని సన్యాసం తీసుకుంటే బావుంటుందని అనుకుంటారు. కానీ బంధాలు.. బాధ్యతలు.. ఆశలు.. కోర్కెలు.. వెనక్కి లాగేస్తుంటాయి. కానీ వీటన్నింటిని తృణప్రాయంగా భావించి సన్యాసం స్వీకరిస్తున్న వారు ఇటీవల వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు. మొన్నామధ్య భార్యాభర్తలు కోట్ల ఆస్తిని, ఆఖరికి పేగుబంధాన్ని కూడా వదులుకుని సన్యాసం స్వీకరించారు. ఇప్పుడు అదే కోవకి చెందిన మరో వ్యక్తి పేరు వినిపిస్తోంది. ఛత్తీస్ఘడ్లోని జగదల్పూర్కు చెందిన లోకేష్ గోల్చా. ఇతడు అమెరికాలో ఓ పెద్ద గ్రాఫిక్ డిజైనింగ్ సంస్థకు అధిపతి. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. బంధువుల సాయంతో చదువుకుంటూ విశాఖపట్నంలోనే విజువల్ గ్రాఫిక్స్లో డిప్లమో పూర్తి చేశాడు. అంచెలంచెలుగా ఎదిగి అమెరికాలో ప్రముఖ కంపెనీ భాగస్వామ్యంతో గ్రాఫిక్ డిజైనింగ్ స్టూడియోను స్థాపించే స్థాయికి ఎదిగాడు. ఇదిలా ఉండగా జైన ముని పియూష్ సాగర్ ఉపన్యాసాలకు లోకేష్ ప్రభావితుడయ్యాడు. సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. నవంబరు 15న తన గురువు నుంచి దీక్ష తీసుకోనున్నారు లోకేష్.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







