స్కూల్లో అగ్ని ప్రమాదం: 14 మందికి గాయాలు
- October 29, 2017
మస్కట్: దఖ్లియాలోని నిజ్వాలోగల బిర్కత్ అల్ మౌజ్ ప్రాంంలో ఓ స్కూలు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఉమ్ అల్ ఫాదిల్ ప్రైమరీ స్కూల్లో జరిగిన ఈ అగ్ని ప్రమాద ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి. ఉదయం 6.57 నిమిషాల సమయంలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్సెస్ అధికార ప్రతినిథి చెప్పారు. సమాచారం అందుకోగానే, అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు సివిల్ డిఫెన్స్ టీమ్ మెంబర్స్. ఫైర్ ఫైటర్స్ చాకచక్యంగా వ్యవహరించి మంటల్ని అదుపు చేశారు. ఈ ఘటనలో 14 మందికి గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. పొగ పీల్చడం, చిన్న చిన్న గాయాలు మాత్రమే కావడంతో ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం బాధితుల్ని తమ తమ ఇళ్ళకు పంపించివేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







