స్కూల్లో అగ్ని ప్రమాదం: 14 మందికి గాయాలు
- October 29, 2017
మస్కట్: దఖ్లియాలోని నిజ్వాలోగల బిర్కత్ అల్ మౌజ్ ప్రాంంలో ఓ స్కూలు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఉమ్ అల్ ఫాదిల్ ప్రైమరీ స్కూల్లో జరిగిన ఈ అగ్ని ప్రమాద ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి. ఉదయం 6.57 నిమిషాల సమయంలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్సెస్ అధికార ప్రతినిథి చెప్పారు. సమాచారం అందుకోగానే, అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు సివిల్ డిఫెన్స్ టీమ్ మెంబర్స్. ఫైర్ ఫైటర్స్ చాకచక్యంగా వ్యవహరించి మంటల్ని అదుపు చేశారు. ఈ ఘటనలో 14 మందికి గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. పొగ పీల్చడం, చిన్న చిన్న గాయాలు మాత్రమే కావడంతో ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం బాధితుల్ని తమ తమ ఇళ్ళకు పంపించివేశారు.
తాజా వార్తలు
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!







