మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు
- October 31, 2017
మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. మంగళవారం ఇందిరాగాంధీ 33 వర్ధంతి సందర్భంగా ఆయన ట్విటర్లో స్పందిస్తూ... ''మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళులు...'' అని పేర్కొన్నారు. కాగా ఇందిరా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని శక్తి స్థల్ వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు కూడా ఘనంగా నివాళులు అర్పించారు.
భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ.. తొలి మహిళా ప్రధానమంత్రిగా సేవలందించిన విషయం తెలిసిందే. 1984 అక్టోబర్ 31న ఆమె తన బాడీగార్డుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. 'ఆపరేషన్ బ్లూ స్టార్' ప్రారంభించిన ఏడాదే ఆమె హత్యకు గురయ్యారు. 1975లో 21 నెలల పాటు దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో ఇందిరా గాంధీపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. ఎమర్జెన్సీ విధించిన కాలాన్ని ఇప్పటికీ స్వతంత్ర భారత దేశంలో ''చీకటి యుగం''గా పిలుస్తారు.
తాజా వార్తలు
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!







