మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు

- October 31, 2017 , by Maagulf
మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు

మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. మంగళవారం ఇందిరాగాంధీ 33 వర్ధంతి సందర్భంగా ఆయన ట్విటర్లో స్పందిస్తూ... ''మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళులు...'' అని పేర్కొన్నారు. కాగా ఇందిరా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని శక్తి స్థల్‌ వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు కూడా ఘనంగా నివాళులు అర్పించారు.
భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ.. తొలి మహిళా ప్రధానమంత్రిగా సేవలందించిన విషయం తెలిసిందే. 1984 అక్టోబర్ 31న ఆమె తన బాడీగార్డుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. 'ఆపరేషన్ బ్లూ స్టార్' ప్రారంభించిన ఏడాదే ఆమె హత్యకు గురయ్యారు. 1975లో 21 నెలల పాటు దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో ఇందిరా గాంధీపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. ఎమర్జెన్సీ విధించిన కాలాన్ని ఇప్పటికీ స్వతంత్ర భారత దేశంలో ''చీకటి యుగం''గా పిలుస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com