మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు
- October 31, 2017
మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. మంగళవారం ఇందిరాగాంధీ 33 వర్ధంతి సందర్భంగా ఆయన ట్విటర్లో స్పందిస్తూ... ''మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళులు...'' అని పేర్కొన్నారు. కాగా ఇందిరా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని శక్తి స్థల్ వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు కూడా ఘనంగా నివాళులు అర్పించారు.
భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ.. తొలి మహిళా ప్రధానమంత్రిగా సేవలందించిన విషయం తెలిసిందే. 1984 అక్టోబర్ 31న ఆమె తన బాడీగార్డుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. 'ఆపరేషన్ బ్లూ స్టార్' ప్రారంభించిన ఏడాదే ఆమె హత్యకు గురయ్యారు. 1975లో 21 నెలల పాటు దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో ఇందిరా గాంధీపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. ఎమర్జెన్సీ విధించిన కాలాన్ని ఇప్పటికీ స్వతంత్ర భారత దేశంలో ''చీకటి యుగం''గా పిలుస్తారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







