భారతదేశంలోనే అత్యంత చెత్త సచివాలయం మనదే : సీఎం కెసిఆర్
- November 01, 2017
భారతదేశంలోనే ఇంత చెత్త సచివాలయం లేనే లేదన్నారు కేసీఆర్. అసెంబ్లీలో కొత్త సచివాలయ నిర్మాణంపై బీజేపీ సభ్యుల అడిగిన ప్రశ్నలపై సీఎం స్పందించారు. ఎక్కడ స్థలం ఉంటే అక్కడ భవనాలను నిర్మించారని... కనీసం ఫైర్ సేఫ్టీ కూడా లేదన్నారు. సచివాలయం అనేది రాష్ట్రానికి ముఖ్య సూచికంగా ఉండాలన్నారు సీఎం.
సెక్రటేరియెట్లో అన్ని శాఖల భవనాలు ఒకేచోట ఉండాలన్నారు కేసీఆర్. కాని ప్రస్తుత సచివాలయంలో మాత్రం భిన్నమైన పరిస్థితి ఉందని చెప్పారు. అసెంబ్లీ, సెక్రటేరియెట్లు ఒకేచోట ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వాస్తు కోసమే కొత్త భవనాలను నిర్మిస్తున్నామనడం సరికాదని... వాస్తు అనేది ఓ కారణం మాత్రమేనన్నారు సీఎం.
కొత్త సెక్రటేరియెట్పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కేసీఆర్ మండిపడ్డారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోమన్నారు. తాము ఏం చేస్తున్నామో ప్రజలు గమనిస్తున్నారని... ఏదైనా తప్పు జరిగితే ప్రజా కోర్టులో తేలుతుందన్నారు. కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రధానితో పునాది వేయిస్తామని... చారిత్రక కట్టడాన్ని కట్టి తీరుతామన్నారు. అది మంచో చెడో ప్రజలే నిర్ణయిస్తారన్నారు సీఎం.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







