నకిలీ పాస్పోర్టు కేసులో ఛోటా రాజన్కు కోర్టు 10 రోజుల సీబీఐ కస్టడీ
- November 07, 2015
నకిలీ పాస్పోర్టు కేసులో మాఫియా డాన్ ఛోటా రాజన్కు కోర్టు 10 రోజుల సీబీఐ కస్టడీ విధించింది. భద్రతా కారణాల నేపథ్యంలో శనివారం సీబీఐ ప్రధాన కార్యాలయంలోనే కోర్టు విచారణ జరిపింది. అనంతరం మేజిస్ట్రేట్ అతణ్ని సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. నకిలీ పాస్పోర్టుతో దేశం విడిచిపారిపోయినందుకు రాజన్పై సీబీఐ రెండు కేసులు నమోదు చేసింది. ఇందులో ఒక కేసును అతడిని తీసుకురావడానికి మలేసియా వెళ్లే ముందు కిందటి నెల 31న నమోదు చేసింది. ఈ కేసులోనే కోర్టు అతడికి సీబీఐ కస్టడీ విధించింది. గతనెల 25న ఆస్ట్రేలియా నుంచి ఇండోనేసియాకు వచ్చిన రాజన్ను బాలిలో పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం బాలి నుంచి సీబీఐ అధికారులు రాజన్(అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జే)ను ఢిల్లీకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. రాజన్ నకిలీ పాస్పోర్టులో తండ్రి పేరుగా రాజన్ పేరే ఉంది. ఇండోనేసియా నుంచి ఢిల్లీకి రాజన్ను తరలించాక అతని నుంచి అధికారులు సేకరించిన వాటిలో ఈ పాస్పోర్టు ఉంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









