న్యూయార్క్‌లో ట్రక్కుతో దాడి చేసిన ఉగ్రవాదికి మరణశిక్ష విధించండి

- November 02, 2017 , by Maagulf
న్యూయార్క్‌లో ట్రక్కుతో దాడి చేసిన ఉగ్రవాదికి మరణశిక్ష విధించండి

న్యూయార్క్‌లో ట్రక్కుతో దాడి చేసి 8 మంది మృతికి కారణమైన ఉగ్రవాది సైఫుల్లో సైపోవ్‌కు మరణశిక్ష విధించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఉజ్బెకిస్తాన్‌కు చెందని ఉబర్ డ్రైవర్ సైపోవ్‌ను ఉగ్రవాదిగా చిత్రీకరించిన ట్రంప్.. ఆ ఉన్మాదికి మరణశిక్ష విధించాలని తన ట్విట్టర్‌లో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్రంప్ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ముస్లిం దేశాలపై అనేక ఆంక్షలు విధించారు. ఆ దేశాల నుంచి వస్తున్న వారిని క్షుణ్ణంగా ఇంటర్వ్యూ కూడా చేస్తున్నారు. అయినా కానీ అమెరికాలో ముస్లిం తీవ్రవాదులు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. నేరుగా ట్రంప్ తన అధికారాలను ఉపయోగించకపోయినా.. న్యూయార్క్ ఉగ్రవాదిని ఉరి తీయాలని తన ట్వీట్ ద్వారా వెల్లడించడం సంచలనమే. ఉగ్రవాది సైపోవ్ ప్రస్తుతం న్యూయార్క్ హాస్పటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇస్లామిక్ స్టేట్ వీడియోలను వీక్షించిన తర్వాత.. ఏడాది క్రితమే ఈ దాడి కోసం ప్లానేసినట్లు ఆ ఉగ్రవాది చెప్పాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com