శంషాబాద్ విమానాశ్రయంలో గోల్డ్ స్మగ్లింగ్.. బంగారం సీజ్

- November 02, 2017 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయంలో గోల్డ్ స్మగ్లింగ్.. బంగారం సీజ్

అధికారులెన్ని చర్యలు తీసుకున్నా శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్‌ ఆగడం లేదు. అక్రమార్కులు యథేచ్చగా పసిడిని తరలిస్తున్నారు. తాజాగా 11 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. సౌదీ అరేబియా ఎయిర్ లైన్స్ విమానంలో జెడ్డా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు ఎవ్వరికీ అనుమానం రాకుండా తన లో దుస్తుల్లో రహస్యంగా గోల్డ్‌ను అమర్చుకున్నాడు. దాన్ని తరలించడానికి ప్రయత్నించాడు. అయితే కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి 363 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై అక్రమ రవాణ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com