ఆంధ్రప్రదేశ్లో ద్విచక్ర వాహనదారులకు 'శిరస్త్రాణం తప్పనిసరి'
- November 08, 2015
ఆంధ్రప్రదేశ్లో ద్విచక్ర వాహనదారులకు 'శిరస్త్రాణం (హెల్మెట్) తప్పనిసరి' చేస్తూ ఆ రాష్ట్ర రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు ఈనెల 12వ తేదీ నుంచి ద్విచక్రవాహనదారులు శిస్త్రారాణంను విధిగా అమలు చేయాల్సి ఉంటుంది. అలాగే, శిరస్త్రాణం వాడకంపై ఆదివారం నుంచి బుధవారం వరకు నాలుగు రోజుల పాటు అవగాహన కల్పించాలని.. వినియోగించని వారిపై గురువారం నుంచి కేసులు నమోదు చేయాలని అన్ని జిల్లాల రవాణా అధికారుల్ని కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఆదేశించారు. నిజానికీ ఈ నిబంధన నవంబరు 1నే అమల్లోకి వచ్చినప్పటికీ గంట వ్యవధిలోనే.. రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే. మరుసటిరోజు సుప్రీంకోర్టు కమిటీ ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో వాహనదారుల్లో అవగాహన పెంచి వెంటనే ఈ నిబంధనను అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీంతో రవాణాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి రానున్న ప్రత్యేక బృందాలు హెల్మెట్ నిబంధన అమలు, ఎన్ని కేసులు నమోదు చేశారన్న వివరాలతో డిసెంబరు 4వ తేదీనాటికి నివేదిక పంపాలని ఏపీ రవాణాశాఖను ఇటీవల ఢిల్లీలో జరిగిన విచారణ సమయంలో ప్రమాదాల నియంత్రణపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ ఆదేశించింది.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







