తమిళనాడు మల్టీప్లెక్స్ లో టికెట్ ధర తగ్గనుంది
- November 07, 2015
మల్టీప్లెక్స్లో సినిమా చూడాలని అందరు కోరుకుంటారు..కానీ అక్కడి టికెట్స్ రేటు, బ్రేక్ లో స్నాక్స్ ఆయె ఖర్చు చూసి సామాన్య ప్రజలు మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలంటే భయపడతారు..కానీ ఇప్పటినుండి అలాంటి ఏ భయం లేకుండా మల్టీప్లెక్స్ లో ఎవరయినా , మాములు ధియేటర్ రేటు కే సినిమా చూసేలా హైకోర్ట్ చర్యలు తీసుకుంది..కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు, పక్క రాష్ట్రం తమిళనాడు లో ఈ సువర్ణ అవకశం కల్పించింది.వివరాల్లోకి వెళ్తే. తమిళనాడులో మల్టీప్లెక్స్ ధియేటర్ లలో టిక్కెట్ ధర రూ.120లు నుంచి రూ.84కు తగ్గిపోనుంది. దీనికి కారణం అక్కడ వినోదపు పన్ను మినహాయింపు పొందుతున్న సినిమాల టిక్కెట్లపై వినోదపు పన్ను వసులు చేయకూడదని హైకోర్టు తీర్పు ఇవ్వడం తో టికెట్స్ రేటు తగ్గనుంది. దీంతో వినోదపు పన్నులేని చిత్రాలన్నీ రూ.84 పెట్టి మల్టీప్లెక్స్ లో సినిమా చూడచ్చు..ఈ తీర్పు తో తమిళ సినీ అబిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







