మహిళా ప్రయాణికుల భద్రత కోసం కొత్త యాప్
- November 03, 2017
ఇటీవల రైళ్లలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. దీంతో ఒంటరిగా ప్రయాణించాలంటేనే వారు భయపడే పరిస్థితి నెలకొంది. దీంతో మహిళా ప్రయాణికుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు పశ్చిమ రైల్వే(డబ్ల్యూఆర్) నడుం బిగించింది.
డబ్ల్యూఆర్కు చెందిన రైల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్) మహిళా ప్రయాణికుల భద్రత కోసం సరికొత్త యాప్ను అందుబాటులోకి తెచ్చింది. 'ఐవాచ్ రైల్వేస్' పేరుతో ఉన్న ఈ యాప్ను అండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ప్లేస్టోర్ నుంచి, ఐఫోన్ వినియోగదారులు ఐ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పశ్చిమ రైల్వే పీఆర్వో రవీంద్ర భాస్కర్ తెలిపారు. ఐవాచ్ టెక్నాలజీస్ సంస్థ సాయంతో దీన్ని రూపొందించినట్లు వెల్లడించారు. 'ప్రమాదంలో ఉన్న మహిళా ప్రయాణికులు ఈ యాప్లో ఉండే అలర్ట్ బటన్ను నాలుగు సార్లు నొక్కితే ముంబయిలోని ఆర్పీఎఫ్ కంట్రోల్రూమ్తో పాటు ఎంపిక చేసిన ఎనిమిది మంది సంరక్షకులు, వైద్యులు, రక్షణ అధికారులకు లొకేషన్తో సహా ఎస్ఎంఎస్ వెళ్లిపోతుంది. బాధితురాలు ఆడియో, వీడియో పుటేజీని కూడా తక్షణం ఆర్పీఎఫ్ కాల్సెంటర్కు పంపించే వెసులుబాటు ఉంది. బాధితురాలి నుంచి హెచ్చరిక రాగానే ఆర్పీఎఫ్ అధికారులు సమీపంలోని సిబ్బందికి సమాచారం ఇస్తారు. దీంతో వీలైనంత వేగంగా రక్షించే అవకాశం ఉంటుంది' అని భాస్కర్ తెలిపారు. గత నెలలో ఆవిష్కరించిన ఈ యాప్ను ఇప్పటివరకు లక్ష మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. దీనిలో ఆడియో, వీడియో సౌకర్యం చక్కగా పనిచేస్తోంది. ఈ యాప్ 60 సెకన్ల ప్రీ అలర్ట్ ఆడియోను, 20 సెకన్ల పోస్ట్ అలర్డ్ వీడియోను తనంతటతానే రికార్డు చేస్తుందని భాస్కర్ తెలిపారు. దీంతో పాటు ఫోన్లో ఛార్జింగ్, నెట్వర్క్ సిగ్నల్, బ్లడ్ గ్రూప్, ఇతర అత్యవసర సమాచారాన్ని ఈ యాప్ ఆర్పీఎఫ్ కాల్సెంటర్కు చేరవేస్తుందని వెల్లడించారు. అయితే యాప్ రైల్వే ప్రాంగణాల్లో ఉన్నప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ముంబయి చర్చిగేట్ స్టేషన్ నుంచి సబర్బన్ రైల్వేస్టేషన్లకు వెళ్లే మార్గాల్లో మాత్రమే ఇది పనిచేస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







