పొగ మా దేశంలోకి వస్తోంది : పాక్
- November 03, 2017
భారత్పై ఎప్పుడూ విషం కక్కే దాయాది పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. భారత్లోని సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్లో పంట వ్యర్థాలను తగులబెట్టడటం వల్ల తమ దేశంలో వాయు కాలుష్యం పెరిగిపోయిందంటూ గగ్గోలు పెడుతోంది. దీనికి తోడు థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ద్వారా వచ్చే పొగ వల్ల కూడా తమ ప్రాంతంలో తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతోందని ఆరోపిస్తోంది.
భారత్ నుంచి వచ్చే పొగ వల్ల తమ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితి నెలకొందని, చలికాలం కూడా వేసవిని తలపిస్తోందని పాకిస్థాన్ దినపత్రిక డాన్ కథనం ప్రచురించింది. 'లాహోర్ పరిసరాల్లో తీవ్రమైన వాయు కాలుష్యం నెలకొంది. భారత్లోని పంజాబ్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం ద్వారా దట్టమైన పొగ, బూడిద ఇటువైపు వస్తోంది' అని డాన్ పత్రిక పేర్కొంది.
'సాహివాల్లోని థర్మల్ ప్రాజెక్టు వల్లే వాయు కాలుష్యం విపరీతంగా ఉంటోంది. అలాంటిది భారత్లోని పంజాబ్లో నాలుగు, రాజస్థాన్లోని తొమ్మిది థర్మల్ ప్రాజెక్టుల నుంచి వెలువడుతున్న పొగ, బూడిద వల్ల మా దేశ సరిహద్దు ప్రాంతాల్లో నాలుగు రోజులుగా తీవ్ర వాయు కాలుష్యం అలుముకుంది' అని పాకిస్థాన్ అధికారులు ఆరోపిస్తున్నారు.
'భారత్లో పంట వ్యర్థాలను భారీస్థాయిలో తగులబెట్టడం వల్ల దట్టమైన పొగ అలుముకుంటోంది. కోర్టు ఆదేశాలు, మీడియా కథనాలు వాటిని నివారించడంలో విఫలమవుతున్నాయి. గత 24 గంటల్లో భారత్లోని పంజాబ్లో 2,620 చోట్ల పంటలను తగులబెట్టినట్లు శాటిలైట్ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. పాకిస్థాన్ పంజాబ్లో మాత్రం కేవలం 27చోట్ల మాత్రమే తగులబెట్టారు. ఈ పొగ బహవాల్పూర్, ముల్తాన్, ఒకారా, పాక్పట్టాన్, చినియాట్, ఫైసలాబాద్ తదితర ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది' అని పాక్ అధికారులు చెబుతున్నారు. గతేడాది ఇదే కాలంలో అలుముకున్న దట్టమైన పొగ కారణంగా పంజాబ్ ప్రజలు కళ్లు మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం తదితర సమస్యలతో బాధపడినట్లు అధికారులు తెలిపారు. ఈ పొగ సమస్యను వర్షాలు మాత్రమే పరిష్కరించగలవని.. కానీ ఈ వారంలో వర్ష సూచనేదీ లేదని వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







