రియాద్పైకి దూసుకొచ్చిన క్షిపణి
- November 04, 2017కల్లోలిత యెమన్ నుంచి దేశ రాజధాని రియాద్పైకి దూసుకొచ్చిన క్షిపణిని సౌదీ అరేబియా నేల కూల్చింది. దీంతో కూలిన క్షిపణికి చెందిన శకలాలు రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేల కూలాయి. ఈ మేరకు సౌదీ అరేబియా అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ మద్దతు కలిగిన షితే హుతి రెబెల్స్(షియా-సున్నీలు ఏర్పరచిన మతపరమైన రాజకీయ శ్రేణులు).. తామే ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది.
రియాద్పైకి వస్తున్న క్షిపణిని కూల్చేయడంతో కింగ్ ఖలీద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఆవరణంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. భారీ ప్రాణం నష్టం కల్గేలా.. జనావాస ప్రాంతాలను టార్గెట్గా చేసుకుని మిస్సైల్ దాడి జరిగిందని సౌదీ అధికారులు పేర్కొన్నారు. 1,200 కిలోమీటర్ల దూరం నుంచి ఈ మిస్సైల్ను ప్రయోగించినట్లు చెప్పారు. ఈ ఏడాది జులైలో కూడా యెమెన్ నుంచి సౌదీలోని మక్కా ప్రాంతంపై క్షిపణి దాడి జరిగింది. దీన్ని కూడా సౌదీ రక్షణ దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం