బాలసుబ్రమణ్యంతో విభేదాలు లేవు : ఇళయరాజా
- November 04, 2017
ఎస్పీ బాలసుబ్రమణ్యంతో తనకు ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు ఇళయరాజా. హైదరాబాద్లో ఓ కార్యక్రమానికి హాజరయిన ఈ మ్యూజిక్ మాస్టర్ బాలుతో విబేధాలపై స్పందించారు. ఎవరితోనూ తనకు గొడవలు లేవన్నారు. దీంతో ఇరువురి మధ్య తలెత్తిన సమస్య పరిష్కారం అయినట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు రారా... పోరా అనుకున్న అత్యంత సన్నిహిత మిత్రులు లీగల్ నోటీసులు, పాటలపై హక్కుల వరకూ వెళ్లారు. ఈ విషయం సినీ వర్గాల్లో సంచలనం రేకెత్తించింది.
కొద్ది నెలల క్రితం ఇళయరాజా కంపోజిషన్లో తాను పాడిన పాటలను స్టేజ్ షోలలో పాడలేనని బాలసుబ్రహ్మణ్యం ఓ లేఖ విడుదల చేశారు. ఇళయరాజా నుంచి తనకు లీగల్ నోటీసులు అందాయని, రాజా కంపోజ్ చేసిన పాటలను ఆయన అనుమతి లేకుండా పాడటానికి వీళ్లేదని నోటీసు ఇచ్చినట్టు తెలిపారు. తనతోపాటు ప్రముఖ గాయని చిత్ర, కుమారుడు చరణ్కి కూడా ఇళయరాజా నోటీసులు పంపారని పేర్కొన్నారు. కాబట్టి ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన పాటలు ప్రదర్శనలలో ఆలపిస్తే పెద్ద మొత్తంలో జరిమానా, చట్టపరమైన విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని అందుకే పాడడం లేదన్నారు. దీంతో ఒక్కసారిగా సినిమా పరిశ్రమలో కలకలం రేగింది. ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరి మధ్య ఏం జరిగిందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు.
ఇళయరాజా వర్సెస్ బాలు వివాదంతో సినీసంగీత ప్రపంచం రెండు వర్గాలుగా చీలిపోయింది. కొందరు ఇళయరాజాను సమర్దిస్తే.. మరికొందరు బాలుకు అండగా నిలిచారు. బహిరంగంగా ఒకరిని ఒకరు విమర్శించుకున్నారు. తాజాగా ఇళయరాజా చేసిన వ్యాఖ్యలు ఇద్దరి మధ్య వివాదం సమసిపోయిందా అన్నట్టు ఉన్నాయి. అదే నిజమైతే మళ్లీ స్నేహితులు కలిసి ఒకే స్టేజిపై కనిపించి సందడి చేసే అవకాశం ఉంది. ఇది సంగీత ప్రియులకు ఆనందంగా పంచే వార్త అవుతుంది.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









