వియత్నాంలో భారీ తుఫాన్, 15 మంది మృతి
- November 04, 2017
అక్టోబరు నెలలో వియత్నాంలో సంభవించిన తుఫాను నుంచి కోలుకోకముందే శనివారం మరో తుఫాను విరుచుకుపడింది. దీంతో 15 మంది మృతిచెందగా, నలుగురు గల్లంతయ్యారు. ఈ తుఫాను ప్రభావంతో ఖాన్ హూవా రాష్ట్రం బాగా దెబ్బతిన్నది. ఈ రాష్ట్రంలో 14 మంది చనిపోయారు. 302 ఇండ్లు నేలమట్టమయ్యాయి. పంట పొలాలు బాగా దెబ్బతిన్నాయి. బిన్దిన్, ఫూ యెన్ రాష్ర్టాలు సైతం తుఫాను ప్రభావానికి గురయ్యాయి. ఈ రాష్ర్టాల్లో ఒకరు మృతిచెందగా, నలుగురు గల్లంత య్యారు. తుఫాను నేపథ్యంలో అధికారులు దాదాపు 35 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాఠశాల విద్యార్థులు ఇంటి నుంచి బయటికి రావద్దని సూచించారు. గత నెలలో తుఫాను వల్ల దాదాపు 75 మంది చనిపోగా, 28 మంది గల్లంతయ్యారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







