సిరియాలో బాంబు దాడి.. 75 మంది మృతి 140 మంది గాయపడ్డారు

- November 05, 2017 , by Maagulf
సిరియాలో బాంబు దాడి.. 75 మంది మృతి 140 మంది గాయపడ్డారు

తూర్పు సిరియాలోని డీర్‌ ఎజార్‌లో శనివారం జరిగిన కారు బాంబు దాడి ఘటనలో సుమారు 75 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. మరో 140 మంది గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూపు (ఐసిస్‌) ప్రకటించింది.కొద్దికాలంగా డీర్‌ ఎజార్‌లో సిరియన్‌ భద్రతాదళాలతో పాటు, అమెరికా ఆధ్వర్యంలోని కుర్దీష్‌ అరబ్‌ దళాలు, సిరియన్‌ ప్రజాస్వామ్య దళాలు ఐసిస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు సిరియన్‌ మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు అబ్దెల్‌ రహ్మాన్‌ పేర్కొన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com