నిందితుల అప్పగింత వ్యవహారం భారత్ దరఖాస్తులను తిరస్కరించిన బ్రిటన్ కోర్టు
- November 05, 2017
బ్రిటన్లో తలదాచుకుంటున్న నిందితులను రప్పించేందుకు.. భారత్ ఇటీవల చేసిన రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. క్రికెట్ ఫిక్సింగ్ కేసు నిందితుడు సంజీవ్కుమార్ చావ్లాను, 1990-93 మధ్య బ్యాంకును మోసగించిన కేసులో నిందితులైన జతిందర్, ఆశారాణి దంపతులను అప్పగించాలని.. భారత అధికారులు చేసిన దరఖాస్తులను బ్రిటన్ కోర్టు తిరస్కరించింది. భారత్లో రూ.9వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగవేసి లండన్కు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా.. అప్పగింతకు సంబంధించిన కేసులోనూ ఈ కోర్టే వాదనలు వింటోంది. నవంబరు 20న ఈ కేసులో తదుపరి విచారణ జరుగనుంది. ఇటు సంజీవ్కుమార్ అప్పగింత కోసం చేసిన దరఖాస్తును విచారిస్తూ.. భారత్లోని తిహార్ జైల్లో అతడు అధికారులు, ఇతర ఖైదీల చేతిలో హింసకు గురయ్యే అవకాశముందని భావిస్తున్నట్లు కోర్టు తెలిపింది. తిహార్లో మానవ హక్కుల ఉల్లంఘనలు సాధారణమన్న నిపుణుల వాదన ఆధారంగా..
అక్టోబర్ 16న ఈ దరఖాస్తును తోసిపుచ్చింది. మరోవైపు జతిందర్, ఆశారాణిలు ఎదుర్కుంటున్న నేరారోపణలు పాతికేళ్ల నాటివని వ్యాఖ్యానించిన కోర్టు.. జాప్యంతోపాటు ఇతరత్రా కారణాలనూ చూపుతూ భారత దరఖాస్తును అక్టోబర్ 12న తిరస్కరించింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









