నిందితుల అప్పగింత వ్యవహారం భారత్ దరఖాస్తులను తిరస్కరించిన బ్రిటన్ కోర్టు
- November 05, 2017
బ్రిటన్లో తలదాచుకుంటున్న నిందితులను రప్పించేందుకు.. భారత్ ఇటీవల చేసిన రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. క్రికెట్ ఫిక్సింగ్ కేసు నిందితుడు సంజీవ్కుమార్ చావ్లాను, 1990-93 మధ్య బ్యాంకును మోసగించిన కేసులో నిందితులైన జతిందర్, ఆశారాణి దంపతులను అప్పగించాలని.. భారత అధికారులు చేసిన దరఖాస్తులను బ్రిటన్ కోర్టు తిరస్కరించింది. భారత్లో రూ.9వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగవేసి లండన్కు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా.. అప్పగింతకు సంబంధించిన కేసులోనూ ఈ కోర్టే వాదనలు వింటోంది. నవంబరు 20న ఈ కేసులో తదుపరి విచారణ జరుగనుంది. ఇటు సంజీవ్కుమార్ అప్పగింత కోసం చేసిన దరఖాస్తును విచారిస్తూ.. భారత్లోని తిహార్ జైల్లో అతడు అధికారులు, ఇతర ఖైదీల చేతిలో హింసకు గురయ్యే అవకాశముందని భావిస్తున్నట్లు కోర్టు తెలిపింది. తిహార్లో మానవ హక్కుల ఉల్లంఘనలు సాధారణమన్న నిపుణుల వాదన ఆధారంగా..
అక్టోబర్ 16న ఈ దరఖాస్తును తోసిపుచ్చింది. మరోవైపు జతిందర్, ఆశారాణిలు ఎదుర్కుంటున్న నేరారోపణలు పాతికేళ్ల నాటివని వ్యాఖ్యానించిన కోర్టు.. జాప్యంతోపాటు ఇతరత్రా కారణాలనూ చూపుతూ భారత దరఖాస్తును అక్టోబర్ 12న తిరస్కరించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







