నిందితుల అప్పగింత వ్యవహారం భారత్ దరఖాస్తులను తిరస్కరించిన బ్రిటన్ కోర్టు
- November 05, 2017
బ్రిటన్లో తలదాచుకుంటున్న నిందితులను రప్పించేందుకు.. భారత్ ఇటీవల చేసిన రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. క్రికెట్ ఫిక్సింగ్ కేసు నిందితుడు సంజీవ్కుమార్ చావ్లాను, 1990-93 మధ్య బ్యాంకును మోసగించిన కేసులో నిందితులైన జతిందర్, ఆశారాణి దంపతులను అప్పగించాలని.. భారత అధికారులు చేసిన దరఖాస్తులను బ్రిటన్ కోర్టు తిరస్కరించింది. భారత్లో రూ.9వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగవేసి లండన్కు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా.. అప్పగింతకు సంబంధించిన కేసులోనూ ఈ కోర్టే వాదనలు వింటోంది. నవంబరు 20న ఈ కేసులో తదుపరి విచారణ జరుగనుంది. ఇటు సంజీవ్కుమార్ అప్పగింత కోసం చేసిన దరఖాస్తును విచారిస్తూ.. భారత్లోని తిహార్ జైల్లో అతడు అధికారులు, ఇతర ఖైదీల చేతిలో హింసకు గురయ్యే అవకాశముందని భావిస్తున్నట్లు కోర్టు తెలిపింది. తిహార్లో మానవ హక్కుల ఉల్లంఘనలు సాధారణమన్న నిపుణుల వాదన ఆధారంగా..
అక్టోబర్ 16న ఈ దరఖాస్తును తోసిపుచ్చింది. మరోవైపు జతిందర్, ఆశారాణిలు ఎదుర్కుంటున్న నేరారోపణలు పాతికేళ్ల నాటివని వ్యాఖ్యానించిన కోర్టు.. జాప్యంతోపాటు ఇతరత్రా కారణాలనూ చూపుతూ భారత దరఖాస్తును అక్టోబర్ 12న తిరస్కరించింది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







