నిందితుల అప్పగింత వ్యవహారం భారత్‌ దరఖాస్తులను తిరస్కరించిన బ్రిటన్‌ కోర్టు

- November 05, 2017 , by Maagulf
నిందితుల అప్పగింత వ్యవహారం భారత్‌ దరఖాస్తులను తిరస్కరించిన బ్రిటన్‌ కోర్టు

 బ్రిటన్‌లో తలదాచుకుంటున్న నిందితులను రప్పించేందుకు.. భారత్‌ ఇటీవల చేసిన రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. క్రికెట్‌ ఫిక్సింగ్‌ కేసు నిందితుడు సంజీవ్‌కుమార్‌ చావ్లాను, 1990-93 మధ్య బ్యాంకును మోసగించిన కేసులో నిందితులైన జతిందర్‌, ఆశారాణి దంపతులను అప్పగించాలని.. భారత అధికారులు చేసిన దరఖాస్తులను బ్రిటన్‌ కోర్టు తిరస్కరించింది. భారత్‌లో రూ.9వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగవేసి లండన్‌కు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్‌ మాల్యా.. అప్పగింతకు సంబంధించిన కేసులోనూ ఈ కోర్టే వాదనలు వింటోంది. నవంబరు 20న ఈ కేసులో తదుపరి విచారణ జరుగనుంది. ఇటు సంజీవ్‌కుమార్‌ అప్పగింత కోసం చేసిన దరఖాస్తును విచారిస్తూ.. భారత్‌లోని తిహార్‌ జైల్లో అతడు అధికారులు, ఇతర ఖైదీల చేతిలో హింసకు గురయ్యే అవకాశముందని భావిస్తున్నట్లు కోర్టు తెలిపింది. తిహార్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు సాధారణమన్న నిపుణుల వాదన ఆధారంగా..

అక్టోబర్‌ 16న ఈ దరఖాస్తును తోసిపుచ్చింది. మరోవైపు జతిందర్‌, ఆశారాణిలు ఎదుర్కుంటున్న నేరారోపణలు పాతికేళ్ల నాటివని వ్యాఖ్యానించిన కోర్టు.. జాప్యంతోపాటు ఇతరత్రా కారణాలనూ చూపుతూ భారత దరఖాస్తును అక్టోబర్‌ 12న తిరస్కరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com