'ది ఇంటచబుల్స్' సినిమాకు రీమేక్గా 'ఊపిరి'
- November 09, 2015
తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జున, తమిళ్ హీరో కార్తీలు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ 'ఊపిరి' వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించనుండగా, అనుష్క, అడవి శేష్లు ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎక్కువ భాగం వీల్ చెయిర్లో కనిపిస్తాడని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. హాలీవుడ్కు చెందిన 'ది ఇంటచబుల్స్' సినిమాకు రీమేక్గా తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోగా, మరో నెల రోజు పాటు సినిమాను షూట్ చేసి, 2016 ఫిబ్రవరి 5న దీన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పీవీపీ బ్యానర్పై పరమ్ వి.పొట్లూరి 'ఊపిరి' సినిమాను నిర్మిస్తుండగా, గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







