'ది ఇంటచబుల్స్' సినిమాకు రీమేక్గా 'ఊపిరి'
- November 09, 2015
తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జున, తమిళ్ హీరో కార్తీలు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ 'ఊపిరి' వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించనుండగా, అనుష్క, అడవి శేష్లు ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎక్కువ భాగం వీల్ చెయిర్లో కనిపిస్తాడని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. హాలీవుడ్కు చెందిన 'ది ఇంటచబుల్స్' సినిమాకు రీమేక్గా తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోగా, మరో నెల రోజు పాటు సినిమాను షూట్ చేసి, 2016 ఫిబ్రవరి 5న దీన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పీవీపీ బ్యానర్పై పరమ్ వి.పొట్లూరి 'ఊపిరి' సినిమాను నిర్మిస్తుండగా, గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









