సీనియర్ దర్శక నిర్మాత హనుమాన్‌ ప్రసాద్ మృతి

- November 06, 2017 , by Maagulf
సీనియర్ దర్శక నిర్మాత హనుమాన్‌ ప్రసాద్ మృతి

సీనియర్ దర్శక నిర్మాత హనుమాన్‌ ప్రసాద్ (74) సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. హనుమాన్ ప్రసాద్ పది చిత్రాలను నిర్మించారు. తల్లీకూతుళ్ళు, శారద, తిరుపతి సినిమాలును ఆయన నిర్మించారు. ప్రసాద్‌ స్వీయ దర్శకత్వంలో కలియుగ మహా భారతం లాంటి ఛాయ చిత్రాలను కూడా తెరమీదకెక్కించారు. ఈ నెల 9న విజయవాడలో హనుమాన్‌ ప్రసాద్‌ అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. హనుమాన్ ప్రసాద్ మృతికి ఎంపీ మురళీ మోహన్ సంతాపం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ హనుమాన్‌ ప్రసాద్ విలువలకు పెద్ద పీట వేశారని కొనియాడారు. హనుమాన్‌ ప్రసాద్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తమ ప్రగాడ సానుభూతిని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com