తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ ఓమాన్ అధ్యక్షులుగా నరేంద్ర పన్నీరు నియామకం
- November 06, 2017
గల్ఫ్ వలసకార్మికుల హక్కుల రక్షణ, సంక్షేమం కోసం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ విదేశీ విభాగం ఓమాన్ శాఖ అధ్యక్షులుగా నరేంద్ర పన్నీరు ను నియమిస్తూ సంస్థ గౌరవ అధ్యక్షులు, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సోమవారం (06.11.2017) హైదరాబాద్ లో నియామకపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మురళి రాజారపు, కార్యవర్గ సభ్యులు మహ్మద్ బషీర్ అహ్మద్ తోపాటు సభ్యులు ఎన్.బాచిరెడ్డి, శేఖర్ రెడ్డి లు పాల్గొన్నారు
ఓమాన్ లో ప్రముఖ ప్రవాస భారతీయుడైన నరేంద్ర పన్నీరు జగిత్యాలకు చెందినవారు. ఓమాన్ దేశంలోని మస్కట్ లో ఒక టెలికం కేబుల్ కంపెనీ యజమాని అయిన నరేంద్ర పన్నీరు తెలంగాణ వలసకార్మికుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. ఇటీవల విడుదలైన 'గల్ఫ్' సినిమా కు ఆయన ఓవర్సీస్ అంబాసిడర్ గా వ్యవహరించారు.
ఫోటో: నరేంద్ర పన్నీరు కు నియామక పత్రం అందజేస్తున్న ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







