తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ ఓమాన్ అధ్యక్షులుగా నరేంద్ర పన్నీరు నియామకం
- November 06, 2017
గల్ఫ్ వలసకార్మికుల హక్కుల రక్షణ, సంక్షేమం కోసం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ విదేశీ విభాగం ఓమాన్ శాఖ అధ్యక్షులుగా నరేంద్ర పన్నీరు ను నియమిస్తూ సంస్థ గౌరవ అధ్యక్షులు, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సోమవారం (06.11.2017) హైదరాబాద్ లో నియామకపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మురళి రాజారపు, కార్యవర్గ సభ్యులు మహ్మద్ బషీర్ అహ్మద్ తోపాటు సభ్యులు ఎన్.బాచిరెడ్డి, శేఖర్ రెడ్డి లు పాల్గొన్నారు
ఓమాన్ లో ప్రముఖ ప్రవాస భారతీయుడైన నరేంద్ర పన్నీరు జగిత్యాలకు చెందినవారు. ఓమాన్ దేశంలోని మస్కట్ లో ఒక టెలికం కేబుల్ కంపెనీ యజమాని అయిన నరేంద్ర పన్నీరు తెలంగాణ వలసకార్మికుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. ఇటీవల విడుదలైన 'గల్ఫ్' సినిమా కు ఆయన ఓవర్సీస్ అంబాసిడర్ గా వ్యవహరించారు.
ఫోటో: నరేంద్ర పన్నీరు కు నియామక పత్రం అందజేస్తున్న ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి
తాజా వార్తలు
- భారత్ టారిఫ్ల పై ట్రంప్కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!
- పుట్టినరోజున ప్రమాదకరమైన స్టంట్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీ అరేబియా ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలు..!!
- అల్-జౌన్, షేక్ జాబర్ కాజ్వే లో అగ్నిమాపక కేంద్రాలు..!!
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం







