అంగారక యాత్రకు 1,38,899 భారతీయులు
- November 09, 2017
ప్రపంచవ్యాప్తంగా బుధ యాత్రకు వెళ్తున్నవారిలో భారతీయులు కూడా చేరారు. ఈ యాత్ర కోసం భారత్ నుంచి 1,38,899 మంది నాసా ద్వారా తమ పేరిట టికెట్లను బుక్ చేసుకున్నారు. 2018, మే 5న నాసా ప్రయోగించనున్న ఇన్సైట్ (ఇంటీరియర్ ఎక్స్ప్లోరేషన్ యూజిం గ్ సైస్మిక్ ఇన్వెస్టిగేషన్స్, జి యోడెసీ అండ్ హీట్ ట్రాన్స్పోర్ట్) మిషన్ ద్వారా వీరంతా అరుణ గ్రహానికి చేరుకోనున్నారు. వీరంతా భౌతికంగా అక్కడికి వెళ్తారని అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పొరబడ్డట్టే..! విషయం ఏమిటంటే : అంగారక గ్రహానికి వెళ్లేందుకు పేర్లను బుక్ చేసుకున్న వారికి నాసా ఇప్పటికే ఆన్లైన్ బోర్డిండ్ పాసులను కూడా జారీచేసింది. వీరి పేర్లు మాత్రమే వెళ్తాయి. టికెట్లు బుక్ చేసుకున్న వారి పేర్లను పల్చని సిలికాన్ మైక్రోచిప్పై ఒక ఎలక్ట్రాన్ బీమ్ను ఉపయోగించి మనిషి వెంట్రుకలో వెయ్యో వంతు వ్యాసం ఉండే అక్షరాలతో రూపొందిస్తారు. ఈ చిప్ను ల్యాండర్ పైభాగంలో అమరుస్తారు. ఇన్సైట్ ద్వారా మార్స్పైకి పేర్లను పంపిస్తామన్న నాసా ఇచ్చిన పిలుపునకు ప్రపంచవ్యాప్తంగా 24.29 లక్షల మంది స్పందించారు. వారిలో భారతీయులు మూడోస్థానంలో నిలిచినట్టు నాసా బుధవారం పేర్కొన్నది.
ఈ జాబితాలో 6.76 లక్షల మందితో అమెరికా, 2.62 లక్షల మందితో చైనా, 1.38 లక్షల మందితో భారత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







