సింగపూర్లో హైదరాబాద్ చెందిన ఓ నగల వ్యాపారి వాసుదేవ్ రాజ్ దారుణ హత్య
- November 10, 2017
హైదరాబాద్కు చెందిన ఓ నగల వ్యాపారి వాసుదేవ్ రాజ్ సింగపూర్లో దారుణ హత్యకు గురయ్యాడు. వ్యాపార లావాదేవీల కోసం వాసుదేవ్ను నిందితులు అక్కడికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. తీరా సింగపూర్ వెళ్లాక అతన్ని ఓ గదిలో నిర్బంధించారు. 3 కోట్లు ఇస్తే తప్ప వదిలిపెట్టేది లేదని, అడిగింది ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. వాసుదేవ్ బంధువులకు వాట్సప్లో మెసేజ్లు పెట్టారు. ఫోన్లు కూడా చేశారు. బంధించిన ఫొటోలు కూడా పోస్ట్ చేశారు. దీంతో కంగారు పడిన వాసుదేవ్ భార్య.. వారితో మాట్లాడింది. అంత పెద్ద మొత్తం తమ వద్ద లేదని, తన భర్తను వదిలిపెట్టాలని వేడుకుంది. వాసుదేవ్ సోదరుడు సైతం కిడ్నాప్ ముఠాతో మాట్లాడినా వాళ్లు ఏమాత్రం తగ్గలేదు. అనుకున్న సమయానికి డబ్బు ఇవ్వలేదన్న కారణంతో వాసుదేవ్ను చంపేసి ఆ ముఠా పరారయ్యింది. కుషాయిగూడలో ఉంటున్న వాసుదేవ్ కుటుంబ సభ్యులు, ఇండియన్ ఎంబసీ ద్వారా మర్డర్ విషయం తెలుసుకుని షాక్కి గురయ్యారు. రెండ్రోజుల్లో డెడ్బాడీని హైదరాబాద్ తెప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
సింగపూర్లో జరిగిన ఈ మర్డర్ తీవ్ర కలకలం రేపింది. వాసుదేవ్ వెంట ఎవరెవరు అక్కడికి వెళ్లారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్లకు వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలు తీసుకున్నారు. ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









