సింగపూర్లో హైదరాబాద్ చెందిన ఓ నగల వ్యాపారి వాసుదేవ్ రాజ్ దారుణ హత్య
- November 10, 2017
హైదరాబాద్కు చెందిన ఓ నగల వ్యాపారి వాసుదేవ్ రాజ్ సింగపూర్లో దారుణ హత్యకు గురయ్యాడు. వ్యాపార లావాదేవీల కోసం వాసుదేవ్ను నిందితులు అక్కడికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. తీరా సింగపూర్ వెళ్లాక అతన్ని ఓ గదిలో నిర్బంధించారు. 3 కోట్లు ఇస్తే తప్ప వదిలిపెట్టేది లేదని, అడిగింది ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. వాసుదేవ్ బంధువులకు వాట్సప్లో మెసేజ్లు పెట్టారు. ఫోన్లు కూడా చేశారు. బంధించిన ఫొటోలు కూడా పోస్ట్ చేశారు. దీంతో కంగారు పడిన వాసుదేవ్ భార్య.. వారితో మాట్లాడింది. అంత పెద్ద మొత్తం తమ వద్ద లేదని, తన భర్తను వదిలిపెట్టాలని వేడుకుంది. వాసుదేవ్ సోదరుడు సైతం కిడ్నాప్ ముఠాతో మాట్లాడినా వాళ్లు ఏమాత్రం తగ్గలేదు. అనుకున్న సమయానికి డబ్బు ఇవ్వలేదన్న కారణంతో వాసుదేవ్ను చంపేసి ఆ ముఠా పరారయ్యింది. కుషాయిగూడలో ఉంటున్న వాసుదేవ్ కుటుంబ సభ్యులు, ఇండియన్ ఎంబసీ ద్వారా మర్డర్ విషయం తెలుసుకుని షాక్కి గురయ్యారు. రెండ్రోజుల్లో డెడ్బాడీని హైదరాబాద్ తెప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
సింగపూర్లో జరిగిన ఈ మర్డర్ తీవ్ర కలకలం రేపింది. వాసుదేవ్ వెంట ఎవరెవరు అక్కడికి వెళ్లారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్లకు వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలు తీసుకున్నారు. ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష