న్యూయార్క్- దిల్లీ విమానసర్వీసులు రద్దు: కాలుష్యమే కారణం
- November 11, 2017
దిల్లీకి అంతర్జాతీయ విమాన సర్వీసులపై కాలుష్య ప్రభావం పడింది. యునైటెడ్ ఎయిర్లైన్స్ న్యూయార్క్-దిల్లీ విమాన సర్వీసులు రద్దు చేసింది. కాలుష్యంతో పాటు పొగమంచు తీవ్రంగా ఉండటంతో రెండు రోజుల పాటు విమాన సర్వీసులు రద్దు చేసినట్లు యునైటెడ్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. శనివారం, ఆదివారం దిల్లీకి చేరుకోవాల్సిన విమానాలు రద్దు చేసి ప్రయాణికుల టిక్కెట్లు రీ షెడ్యూల్ చేసినట్లు యునైటెడ్ సంస్థ ప్రకటించింది. కాలుష్యం తీవ్ర రూపం దాల్చడంతో దేశరాజధాని దిల్లీకి అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య కూడా తగ్గింది. పొగ మంచు కారణంగా గత కొన్ని రోజులుగా పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







