ఒక విద్యార్ధి కలిగించిన అలజడి
- November 12, 2017
గురుగ్రామ్: సంచలనం సృష్టించిన ఏడేళ్ల బాలుడు ప్రద్యుమన్ హత్య కేసులో రోజుకో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వస్తూనే ఉంది. హత్య కేసులో సీబీఐ అదుపులో ఉన్న సీనియర్ విద్యార్థి వివిధ రకాల విషపదార్థాల గురించి అంతర్జాలంలో వెతికినట్లు సమాచారం. వాటిని ఎలా ఉపయోగించాలి, హత్య చేసిన తర్వాత కత్తి మీద వేలిముద్రలు ఎలా తీసేయాలనే దాని గురించి నెట్లో పరిశోధించినట్లు తెలుస్తోంది. విద్యార్థి దగ్గర నుంచి సీబీఐ అధికారుల స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ను పరిశీలించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
ప్రద్యుమన్ గొంతు కోసేందుకు ఉపయోగించిన కత్తిని హత్యకు ఒకరోజు ముందు సదరు విద్యార్థి కొనుగోలు చేసినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. దీనిపై సీబీఐ అధికారులు మాట్లాడుతూ.. విచారణ చాలా సున్నితమైన దశలో ఉందని తెలిపారు. ఇప్పుడే దీనిపై ఎటువంటి వ్యాఖ్య చేయలేమని సీబీఐ ప్రతినిధి అభిషేక్ దయాల్ తెలిపారు.
ప్రస్తుతం విచారణ నిమిత్తం విద్యార్థిని జువైనల్ హోమ్కు తరలించారు. సెప్టెంబర్ 8న గురుగ్రామ్లోని రేయాన్ అంతర్జాతీయ పాఠశాలలో ఏడేళ్ల బాలుడు ప్రద్యుమన్ను దారుణంగా గొంతు కోసి హత్య చేసిన విషయం తెలిసిందే. తొలుత ఈ హత్యను బస్సు కండక్టర్ అశోక్ కుమార్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కానీ, ఇటీవల ఈ కేసు కీలక మలుపు తిరిగింది. పాఠశాలలో జరుగుతున్న పరీక్షను వాయిదా వేయించేందుకు ప్రద్యుమన్ను అదే పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి హత్య చేసినట్లు బయటకు వచ్చింది. అతడిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







