ఐసిస్ లో వందమంది కేరళీయులు!
- November 12, 2017
తిరువనంతపురం: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థలో ఇప్పటి వరకు వందమంది కేరళీయులు చేరి ఉండవచ్చని కేరళ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 300కు పైగా ఆడియో క్లిప్పులు, వివిధ మెసేజింగ్ యాప్లు, సోషల్ మీడియాను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చారు.
21 మంది కేరళీయులు కనిపించకుండా పోవడంపై దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ వారంతా ఇస్లామిక్ స్టేట్లో చేరి ఉంటారని భావిస్తోంది. తాజాగా ఓ మహిళకు ఫోన్ వచ్చిన ఫోన్ కాల్ను పరిశీలించిన పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చారు. ఐసిస్లో చేరిన ఓ మహిళ భర్త షాజిల్ 'జిహాద్ వార్'లో మరణించినట్టు ఆమెకు చెప్పడం స్పష్టంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె తన ఇద్దరు కుమారులతో సిరియాలోనే ఉంది. చాలామంది కేరళ యువతులు తమ భర్తలను పోగొట్టుకుని పిల్లలతో కలిసి సిరియాలో ఉన్నట్టు ఆమె పేర్కొంది. ఈ ఆడియో క్లిప్ షాజిల్ సోదరుడి నుంచి వచ్చినట్టు తెలుస్తోంది.
ఖయూమ్ అనే మరో వ్యక్తి ఆడియో క్లిప్ కూడా పోలీసులకు చిక్కింది. ఐసిస్ యూనిఫామ్లో ఉన్న ఖయూమ్ ఫొటోలు ఇంటర్నెట్లో విరివిగా ఉన్నాయి. ఐసిస్తో సంబంధాలున్న ముగ్గురిని అక్టోబరు 25న పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ముగ్గురు ఏళ్ల క్రితమే కేరళను విడిచిపెట్టి సిరియా వెళ్లారు. అక్కడ వారు ఉగ్రవాద సంస్థలో శిక్షణ తీసుకున్నారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







