జీఎస్టీ ఎఫెక్ట్: రూపాయి బలహీనం డాలర్ కి బలం
- November 13, 2017
దేశీయ కరెన్సీ రూపాయి విలువ సోమవారం భారీగా క్షీణించింది. జీఎస్టీ కౌన్సిల్ పన్ను రేట్లపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో భారీ ఆర్థిక భారం పడనుందనే భయంతో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. కౌన్సిల్ తాజా నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థపై సంవత్సరానికి రూ .20వేల కోట్ల భారనుంది. డాలర్ మారకరంలో 20 పైసలు క్షీణించి రూ.65.36 కు చేరుకుంది.
మరో వైపు డాలర్ బలం కూడా రూపీ విలువ క్షీణతకు దాసింది. ఇతర కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ బలం, విదేశీ ఫండ్ ప్రవాహాలు కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచాయి. దిగుమతిదారులు, బ్యాంకుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ తో రూపాయి విలువ పతనం కారణమని డీలర్స్ భావిస్తున్నారు.
దీంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఈక్విటీ మార్కెట్లనుంచి రూ.529 కోట్ల మేర పెట్టబడులును శుక్రవారం ఉపసంహరించుకున్నారు. శుక్రవారం ముగింపులో రూపాయి 22పైసలు కోల్పోయి రూ.65.16వద్ద ముగిసింది. మరోవైపు దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







