జీఎస్టీ ఎఫెక్ట్: రూపాయి బలహీనం డాలర్ కి బలం
- November 13, 2017
దేశీయ కరెన్సీ రూపాయి విలువ సోమవారం భారీగా క్షీణించింది. జీఎస్టీ కౌన్సిల్ పన్ను రేట్లపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో భారీ ఆర్థిక భారం పడనుందనే భయంతో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. కౌన్సిల్ తాజా నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థపై సంవత్సరానికి రూ .20వేల కోట్ల భారనుంది. డాలర్ మారకరంలో 20 పైసలు క్షీణించి రూ.65.36 కు చేరుకుంది.
మరో వైపు డాలర్ బలం కూడా రూపీ విలువ క్షీణతకు దాసింది. ఇతర కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ బలం, విదేశీ ఫండ్ ప్రవాహాలు కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచాయి. దిగుమతిదారులు, బ్యాంకుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ తో రూపాయి విలువ పతనం కారణమని డీలర్స్ భావిస్తున్నారు.
దీంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఈక్విటీ మార్కెట్లనుంచి రూ.529 కోట్ల మేర పెట్టబడులును శుక్రవారం ఉపసంహరించుకున్నారు. శుక్రవారం ముగింపులో రూపాయి 22పైసలు కోల్పోయి రూ.65.16వద్ద ముగిసింది. మరోవైపు దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా
- సహారా ఎడారిలో తీవ్ర విషాదం..నీళ్లు దొరక్క 49 మంది మృతి
- ముంబయిలో 'తెలుగు భవనం' ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్లోని స్పా సెంటర్లపై పోలీసుల మెరుపు దాడి
- భారత్–యూకే క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ప్రారంభం..
- బర్కాలో భారీగా నకిలీ వాహన విడిభాగాల స్వాధీనం..ముగ్గురికి జైలు, జరిమానా
- ఆఫ్రికా నుండి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్
- యూఏఈ జాతీయ ప్రతిజ్ఞకు ఆన్లైన్లో మద్దతు తెలిపే అవకాశం..
- జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ









