జమ్మూ కశ్మీర్లోని వైష్ణోదేవి దర్శనంపై పరిమితి విధించిన ఎన్జీటీ
- November 13, 2017
జమ్మూ కశ్మీర్లోని వైష్ణోదేవి పుణ్యక్షేత్రాన్ని దర్శించే భక్తులకు ఇది చేదు వార్తే! ఎందుకంటే ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్యపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పరిమితి విధించింది. రోజుకు 50 వేల మంది మాత్రమే ఆలయాన్ని సందర్శించాలని స్పష్టం చేసింది. అంతకుమించి వచ్చే భక్తులను అర్ధక్వారీ లేదా కాత్రా వద్ద నిలిపివేయాలని ఆదేశించింది. పుణ్యక్షేత్రం లోపల చేపడుతున్న నూతన నిర్మాణాలను కూడా నిలిపివేయాలని జస్టిస్ స్వాతంత్ర కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం అదేశించింది. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేందుకు పాదచారుల కోసం కొత్తగా నిర్మించిన దారిని ఈ నెల24 నుంచి ప్రారంభించవచ్చుననీ.. అయితే ఈ దారిలో బ్యాటరీ కారులు తప్ప గుర్రాలు, గాడిదలకు అనుమతి ఇవ్వరాదని సూచించింది. పాతదారిలో కూడా క్రమంగా ఈ జంతువులను ఉపయోగించకుండా నిరోధించాలని తెలిపింది. కాత్రా సమీపంలోని బస్స్టాప్లోనూ, ఆలయానికి వెళ్లే దారుల్లోనూ చెత్త పడేసిన వారికి రూ.2 వేల జరిమానా విధించాలని సూచించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







