జమ్మూ కశ్మీర్లోని వైష్ణోదేవి దర్శనంపై పరిమితి విధించిన ఎన్జీటీ
- November 13, 2017
జమ్మూ కశ్మీర్లోని వైష్ణోదేవి పుణ్యక్షేత్రాన్ని దర్శించే భక్తులకు ఇది చేదు వార్తే! ఎందుకంటే ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్యపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పరిమితి విధించింది. రోజుకు 50 వేల మంది మాత్రమే ఆలయాన్ని సందర్శించాలని స్పష్టం చేసింది. అంతకుమించి వచ్చే భక్తులను అర్ధక్వారీ లేదా కాత్రా వద్ద నిలిపివేయాలని ఆదేశించింది. పుణ్యక్షేత్రం లోపల చేపడుతున్న నూతన నిర్మాణాలను కూడా నిలిపివేయాలని జస్టిస్ స్వాతంత్ర కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం అదేశించింది. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేందుకు పాదచారుల కోసం కొత్తగా నిర్మించిన దారిని ఈ నెల24 నుంచి ప్రారంభించవచ్చుననీ.. అయితే ఈ దారిలో బ్యాటరీ కారులు తప్ప గుర్రాలు, గాడిదలకు అనుమతి ఇవ్వరాదని సూచించింది. పాతదారిలో కూడా క్రమంగా ఈ జంతువులను ఉపయోగించకుండా నిరోధించాలని తెలిపింది. కాత్రా సమీపంలోని బస్స్టాప్లోనూ, ఆలయానికి వెళ్లే దారుల్లోనూ చెత్త పడేసిన వారికి రూ.2 వేల జరిమానా విధించాలని సూచించింది.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









